వివాహములు ఎన్ని రకాలు

వివాహములు ఎన్ని రకాలు

వివాహం అనగా రెండు నిండు జీవితాల కలయిక . వేరు వేరు పరిస్థితులలో పెరిగిన ఇద్దరు మాంగల్యం తో ,వేద మంత్ర ఘోషతో , అగ్ని సాక్షిగా ఒకటై కొత్త జీవితానికి పునాది వేయడం .

  మాంగల్యం తంతునా నేనా మమ  జీవన జీవన హేతున కంటే బాధ్రామి సుభగే త్వం జీవ శరదాం శతం .

మాంగల్యం ద్వారా మా జీవితం 100 సంవత్సరాలు సుఖ సంతోషాలతో కళకళ లాడాలి అని పై మంత్రానికి అర్ధం .

కేవలం ఇద్దరు మనుషులు మాత్రమె కాదు రెండు కుటుంబాల కలయిక వివాహం .

వివాహములు ఎన్ని రకాలు

 

వివాహాలు 8 రకాలని మను ధర్మ శాస్త్రం లో చెప్పబడింది . అవి

భ్రహ్మ వివాహం ;- 

          పెళ్లి కుమార్తె తండ్రి తనకు నచ్చిన మంచి విజ్ఞానము ,నడవడి కలిగిన యువకుడిని అల్లుడిగా ఎంపిక చేస్తాడు . పెళ్లి కూతురికి వరుడి ఎంపికలో స్వేచ్చ వుండదు . దీనిలో కన్యాదానం ,అగ్నిహోమం ,సప్తపది ,వేద మంత్రోచ్చరణల మద్య వివాహం జరుగుతుంది .

Read More  నాగ పంచమి ప్రాముఖ్యత,Significance Of Naga Panchami

 ప్రజాపత్యము ; –

          ఈ పద్దతిలో వరుడ్ని కన్యాదాత తగిన రీతిని సత్కరించి , వధూవరులిద్దరిని ధర్మ సంస్థాపన కొరకు పూనుకొమ్మని చెప్పి వారి చేత ప్రమాణం చేయిన్చితరువాత వివాహము జరిపిస్తాడు .

భ్రహ్మ వివాహం,ప్రాజాపత్యము రెండు దగ్గరగా వుంటాయి .

 ఆర్ష వివాహం ; –

ఈ పద్దతిలో వధువు తండ్రి వరుడు నుండి ఆవు ,ఎద్దుల జతను కానుకగా తీసుకొని తన కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చేస్తాడు . ఇది కన్యాశుల్కం క్రింద వస్తుంది .

 దైవ వివాహం ; –

 యజ్ఞ యాగాదులు చేసేవారు తమ కుమార్తెను పురోహితునకు ఇచ్చి వివాహం చేయడాన్ని దైవ వివాహం అంటారు

గాందర్వ వివాహం ;

      గాందర్వ వివాహం (నేటి ప్రేమ వివాహాలు )లో పెద్దల ప్రమేయం లేకుండా ఇష్టపడి వివాహం చేసుకోవడం . దీనిలో స్త్రీ ,పురుషులిద్దరికీ స్వేచ్చ వుంటుంది .

   దీనిలో స్త్రీ పురుషులు నచ్చిన వారిని పంచ భూతాల సాక్షిగా వివాహం చేసుకుంటారు . ఉదా ; శకుంతల -దుష్యంతులు ,సావిత్రి -సత్యవంతులు .

Read More  భోజనము చేయుటకు ఉపయోగపడే ఆకులు (విస్తర్లు)

 అసుర వివాహం ;- 

వరుడు కొంత ధనాన్ని , వధువు తండ్రికి ఇచ్చి వధువును వివాహం చేసుకుంటాడు . దీనినే కన్యా శుల్కం అంటారు . దీనికి ఆశ పడి ఒకానొక సమయంలో తమ కుమార్తెలను పండు ముసలి వారికి కుడా ఇచ్చి వివాహం చేసారు .

 రాక్షస వివాహం ;- 

దీనిలో వరుడు కన్యను ఎత్తుకుపోయి , లేదా కన్య తరుపు వారిని యుద్దంలో ఓడించి వివాహం చేసుకుంటాడు .

ఉదా ; రుక్మిణి దేవి ని శ్రీకృష్ణుడు ,అర్జునుడు సుభద్రను ఈ విధం గానే వివాహం చేసుకున్నారు .

 పైసాచికం ; –

నిద్రిస్తున్న లేదా మత్తుమందులు సేవించిన యువతిని వివాహం చేసుకోవడాన్ని పైసాచికం అంటారు . ఈ పద్దతిని మనువు నిషేదించాడు .

Sharing Is Caring:

Leave a Comment