శబరిమల యాత్ర విశేషాలు

?️ ?️
? *శబరిమల యాత్ర విశేషాలు* ?
మిగిలిన దీక్షలతో పోలిస్తే అయ్యప్ప దీక్ష చాలా ప్రత్యేకమైంది. కఠిన నియమాలే ఈ దీక్షకు మూలాధారం. మండల కాలంపాటు‘స్వామియే శరణమయ్యప్ప’అనే ఘోషతో సాగే దీక్ష మానవ జీవన సన్మార్గానికి బాటలు వేస్తుంది. కఠోర దీక్ష చేసి, ఇరుమడిని తలపై ధరించి పదునెట్టాంబడి మీదుగా అయ్యప్పను దర్శించుకోగానే తన్మయత్వం చెందుతారు. అయ్యప్ప దీక్షలో అతి ముఖ్య ఘట్టం వనయాత్ర. దీనినే పెద్ద పాదం అనికూడా అంటారు. స్వామి సన్నిధానానికి గల మార్గాల్లో ఇదీ ఒకటి. ఇరుముడిని తలపై ధరించి ‘కల్లుం ముల్లుం కాలికి మెట్టై.. స్వామికే’ అంటూ సాగే వనయాత్రతో దివ్యానుభూతి కలుగుతుంది. పుణ్య నదుల్లో స్నానం, కొండలు, అడవుల్లో ఉండే ఔషధ వృక్షాల ప్రభావం వల్ల, స్వచ్ఛమైన గాలితో మనకు తెలియకుండానే ఆరోగ్యం, ఉత్సాహం కలుగుతాయి. అదో అనిర్వచనీయమైన అనుభూతి. శబరిగిరీశుడి దర్శనానికి వెళ్లేందుకు అనేక మార్గాలున్నా, శబరిమల యాత్రలో అతి ప్రాచీనమైన మార్గం ఎరుమేలి. ఇది సాక్షాత్తూ అయ్యప్ప స్వామి నడిచి వెళ్లిన పుంగావనం. ఈ ఎరుమేలి మార్గం నుంచే శతాబ్దాలుగా భక్తులు సన్నిధానానికి చేరుకుంటారు.
శబరిమల యాత్ర విశేషాలు

 

*వనయాత్ర కష్టసాధ్యమే కానీ ముక్తికి మార్గం*
*ఎరుమేలి*
ఎరుమేలి నుంచి వనయాత్ర మొదలవుతుంది. భక్తులు తమ శరీరానికి రంగులు పులుముకొని, పేటైతుళ్ళి అనే ఆటవిక  నృత్యం చేసి, పేటయిల్‌ శాస్తాను, వావరు స్వామిని, దర్శించుకుంటారు. వనంలో ప్రవేశించే తమకు తోడుగా రమ్మని ప్రార్థించి యాత్రను ప్రారంభిస్తారు. క్రూరమృగాలు సంచరించే పెరియార్ అటవీ మార్గంలో ఎదురయ్యే ఆటంకాలను స్వామి శరణుఘోషతో దరిచేరనీయకుండా ముందుకు సాగుతారు
.
*కోట్టైప్పడి*
అయ్యప్ప స్వామికి ప్రథమ సేవకుడు, స్నేహితుడు వావరు స్వామి కొలువుదీరిన పుణ్యస్థలి కోట్టైపడి. ‘పేరూర్‌తోడు’అని పిలిచే ఈ ప్రదేశంలో ప్రవహించే కాలువలో చేపల కోసం బొరుగులు (మరమరాలు) వేయడం సంప్రదాయం.
*కాళైకట్టి*
హరిహరసుతుడు అయ్యప్ప స్వామివారు మహిషితో యుద్ధం చేస్తుండంగా సాక్షాత్తూ పరమశివుడు పృథ్వీకి దిగివచ్చి తన వాహనం నందిని కట్టి ఉంచిన స్థలం అని అంటారు. మలయాళంలో నందిని ‘కాళై’ అంటారు. ఇక్కడ అతి పురాతన శివాలయం కూడా ఉంది.
*అళుదా నది*
మహిషిని హరిహరసుతుడు వధించిన స్థలం. అయ్యప్పతో యుద్ధం చేసిన మహిషి స్వామి బాణాలకు తాళలేక రోదిస్తూ కన్నీరు కార్చింది. ఆ కన్నీరు అక్కడ ప్రవహిస్తోన్న అలసా నదీలో కలవడం వల్ల దానికి అళుదానది పేరు వచ్చింది. ఈ నదిలో స్నానమాచరించిన భక్తులు రెండు రాళ్లను తీసుకొని యాత్రామార్గంలోని కల్లిడుకుండ్రుంలో విసురుతారు.
*అళుదా మేడు*
అళుదా నదిలో స్నానం ముగిసిన తర్వాత భక్తులు ఎక్కే నిటారైన కొండయే అళుదామేడు. సుమారు 5కి.మీ. మేర ఉండే ఈ కొండ ఎత్తైన గుండ్రాళ్లతో ఉంటుంది. పైగా ఇక్కడ తాగునీటి సౌకర్యం కూడా ఉండదు.

S

*కలిడుంకుండ్రు*
మహిషిని వధించిన స్వామి ఆమె కళేబరాన్ని ఆకాశంపైకి విసరగా అది నేలపై పడిన స్థలం… కలిడంకుండ్రు. బ్రహ్మహత్యా దోషం నుంచి బయటపడటానికి అళుదానదిలో స్నానమాచరిస్తున్న దేవతలు, మహిషి కళేబరం పెరగడం గమనించి, ఆ నదిలో నుంచి తమ చేతికి దొరికిన రాళ్లను తీసి దానిపైకి వేసి సమాధి చేశారు. అందుకే అళుదానదిలో స్నానం చేసే సమయంలో మూడు రాళ్లను తీసి భద్రపరుచుకోమని మన వెంట వచ్చే గురుస్వాములు చెబుతారు. ఆ రాళ్లను కలిడుండకుండ్రులో విసిరి మహిషి కళేబరానికి నమస్కరించి, హారతి వెలిగించి యాత్రను కొనసాగిస్తారు.
*ఇంజిప్పారకోట*
కలిడుంకుండ్రు తర్వాత వనయాత్రలో చేరే ప్రాంతం ఇంజిప్పారకోట. ఇక్కడే అయ్యప్ప స్వామి ఉదయనుడు అనే బందిపోటు దొంగను హతమార్చారు.అని చెప్తారు. ఇక్కడ శిథిలమైన కోట అవశేషాలు కూడా ఉన్నాయి. ఇక్కడ భక్తులు విశ్రాంతి తీసుకుంటారు.
*కరిమల*
కరిమాల ఎత్తయిన కొండ ఇది. నిట్టనిలువునా ఉంటుంది. సుమారు 10కి.మీ. ఎత్తుకుపోయిన తర్వాత కరిమల శిఖరాన్ని చేరుకుంటారు. ఇక్కడ అతి ప్రాచీనమైన బావి ఉంది. దీంతోపాటూ జలపాతం ఉన్నాయి. ఇవి భక్తుల దాహార్తిని తీరుస్తున్నాయి. ఇంత ఎత్తులో జలపాతం ఒక్క శబరిమల యాత్రలో తప్ప మరెక్కడా కనపడదేమో!! కరిమల ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టమనే నానుడి ఉన్నా, ‘స్వామియే శరణమయ్యప్ప’ అను శరణుఘోష ముందు ఈ కష్టం దూది పింజెలా తేలిపోతుంది.
*వలియాన వట్టం*
కరిమల దిగిన తర్వాత చిన్న కాలువలా నీరు ప్రవహించే ప్రదేశం వలియాన వట్టం. ఇక్కడ ఏనుగుల సంచారం ఎక్కువ. వన్యమృగాలూ సంచరిస్తుంటాయి. చీకటి పడే సమయానికి ఈ ప్రాంతం నుంచి వదిలి వెళ్లేందుకు స్వాములు సిద్ధమవుతారు.
*శిరియాన వట్టం*
ఒకప్పుడు ఇక్కడా ఏనుగుల సంచారం బాగా ఉండేది. కాలక్రమేణ భక్తుల రద్దీ పెరగడంతో ఏనుగులు ఈ ప్రాంతానికి రావడం కనుమరుగైంది. ఇక్కడి నుంచి భక్తులు పంబ వరకు విడిది ఏర్పాటు చేసుకుని వంటలు చేసుకొని భుజించి, విశ్రమిస్తుంటారు.
 
*పావన పంబా నది*
త్రేతాయుగం నుంచి పంబానది ప్రస్తావన ఉంది. ఔషధ మూలికల సారంతో ప్రవహించే ఈ నదిలో స్నానం చేస్తే వనయాత్ర అలసట ఒక్కసారి మటుమాయమవుతుంది. దీనినే దక్షిణ గంగా అని కూడా అంటారు. ఇక్కడ పితృకర్మలు నిర్వహిస్తే ఏడు తరాల వారు మోక్షం పొందుతారని నమ్మకం. ఎరుమేలి నుంచి కాలినడకన వచ్చే వారూ, నిలక్కల్ మీదుగా వాహనాల్లో వచ్చేవారూ ఇక్కడ కలుస్తారు. ఇక్కడ కన్నెమూల మహాగణపతిని దర్చించుకుని కొబ్బరికాయ కొట్టి యాత్ర ముందుకు సాగిస్తారు.
*నీలిమల*
సన్నిధానానికి త్వరగా చేరుకోవాలనే ఉత్కంఠతొ, పావన పదునెట్టాంబడి, స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని చూడాలనుకునే ఆత్రుత ఇక్కడి నుంచే మొదలవుతుంది.  కరిమల కంటే నీలిమల ఎక్కడం ఎంతో కఠినమని కొందరు అంటారు.
*అప్పాచ్చిమేడు*
వనదేవతల, మరియు మన పూర్వీకుల ఆత్మల శాంతి, ప్రీతికోసం నీలిమల శిఖరం రెండు వైపుల నున్ను లోయలో భక్తులు బియ్యపు ఉండలను విసురుతారు. భక్తిని పరిశీలించి, కపట భక్తులకు ఆత్మ ప్రబోధ కల్పించడానికి దేవతలు ఇక్కడ వేచి ఉంటారని భావిస్తారు.
*శరంగుత్తి*
తొలిసారి అయ్యప్పస్వామి మాల ధరించిన భక్తులను కన్నిస్వాములు అంటారు. కన్నిస్వాములు తమ కన్నియాత్రకు నిదర్శనంగా, వనములోని రక్షాదండంగా ఎరుమేలి నుంచి తెచ్చిన శరములను ఇక్కడ గుచ్చుతారు. అప్పటి వరకూ మనకు మార్గం చూపి, వెన్నంట నడిచివచ్చిన కరుప్పస్వామి అక్కడే ఆగిపోతారని ప్రతీతి.శ్రీ మాలికపురత్తమ్మ అమ్మవారు ప్రతి సంవత్సరం ఏనుగు అంబారి మీద వచ్చి కన్నె స్వాములు గుచ్చిన శరములని చూసి బాధతో వెనుతిరిగి వెళుతుంది.
*శబరిపీఠం*
శబరిమాత నిర్గుణోపాసనతో అయ్యప్పస్వామి దర్శనం పొందిన ప్రదేశం. శబరిమాత పేరుతో ఇక్కడ విద్యాపీఠం ఏర్పాటు చేసి, పందళ రాజవంశీయులు విద్యాభ్యాసం చేశారని, ఈ ప్రదేశానికి 5వేల సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు.
*పదినెట్టాంబడి*
వనయాత్రలో అత్యంత ముఖ్యమైనది.. పవిత్రమైనది ఈ పదినెట్టాంపడి ఘట్టం. పవిత్రత నిండిన దైవాంశమైన మూడార్ల సోపానాలనీ, ముక్తికి మెట్లనీ వీటిని అంటారు. మండల కాల దీక్షా వ్రతం లేని వారు ఈ మెట్లను ఎక్కడానికి అర్హులు కారు. మెట్లు ఎక్కేముందు కొబ్బరికాయ కొట్టి, కరుప్పస్వామికి మనసారా మొక్కుతూ.. స్వామియే శరణమయ్యప్ప అనే శరుణు ఘోషతో మెట్లెక్కాలి. అదీ శిరమున ఇరుముడి ధరించి మాత్రమే మెట్లు ఎక్కాలి.
*సన్నిధానం*
ఇరుముడితో పదినెట్టాంబడి దాటి సన్నిధానంలోనికి ప్రవేశించిన భక్తులకు మొదట ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఆ తర్వాత మణి మండపం, మహా గణపతి, సర్పరాజును దర్శిస్తూ ప్రదక్షిణంగా వచ్చి *శ్రీ ధర్మశాస్తా*అయ్యప్ప* దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటారు. చిన్ముద్ర ధారియై ఉన్న స్వామిని కనులారా వీక్షించి, ఆ స్వరూపాన్ని గుండెల్లో ప్రతిష్ఠించుకుంటా ఇరుముడిని స్వామివారికి చూపించి నెయ్యభిషేకం చేయించి  మాలికపురత్తమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని కానుకలు,మ్రొక్కులు తీర్చుకుని చల్లగా చూస్తే మళ్ళీ వస్తాం స్వామి అని తిరుపడి కాయ ( కొబ్బరికాయ) కొట్టి తిరుగు ప్రయాణం అవుతారు.
????స్వామియే శరణం అయ్యప్ప????
Read More  మాలికాపురత్తమ్మ ఆలయం శబరిమలై పూర్తి వివరాలు
Sharing Is Caring:

Leave a Comment