Pesara Pappu Charu:శరీరానికి మేలు చేసే పెసర పప్పుచారు ఇలా చేసుకొండి

Pesara Pappu Charu:శరీరానికి మేలు చేసే పెసర పప్పుచారు ఇలా చేసుకొండి

 

Pesara Pappu Charu: చాలా కాలంగా వంటగదిలో పెసర పప్పును ఉప‌యోగిస్తూ ఉన్నాం. పెసర పప్పు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. పెస‌ర ప‌ప్పు ఫైబర్ యొక్క గొప్ప మూలం, అలాగే కాల్షియం మరియు పొటాషియం. పెస‌ర ప‌ప్పు బిపి మరియు షుగర్‌ని నిర్వహించడంలో మరియు రక్తహీనతను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. పెస‌ర ప‌ప్పు రెగ్యులర్ డైట్‌లో భాగం చేసుకుంటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. పెసరపప్పు జీర్ణమయ్యే మరియు వేగవంతమైన పల్స్, ఇది కేలరీలు తక్కువగా ఉండటమే కాకుండా మనం తినే ఇతర రకాల పప్పుల కంటే తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది.

పెస‌ర ప‌ప్పు జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. పెసపప్పు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. పెస‌ర ప‌ప్పు వివిధ రకాల ఆహార పదార్థాలు మరియు వంటకాలు వండడానికి ఉపయోగిస్తారు. పెస‌రప‌ప్పుతో చేసే చారు చాలా రుచికరమైనది. ఈ పెసర చారును ఎలా తయారుచేయాలి .దానిని తయారు చేయడానికి అవసరమైన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read More  Dates Laddu : పంచదార లేకుండా ఖర్జూరా లడ్డూలు ఇలా చేసుకోవచ్చు

 

Pesara Pappu Charu:శరీరానికి మేలు చేసే పెసర పప్పుచారు ఇలా చేసుకొండి

 

పెసరపప్పు చారు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-

పెసరపప్పు- 1 కప్పు
పసుపు-అర టీస్పూన్
పొడవుగా కోసిన పచ్చిమిర్చి- రెండు
పొడవుగా తరిగినవి ఉల్లిపాయలు– ఒకటి
టొమాటోలు- 2
నూనె – అర టీ స్పూన్‌
కారం – ఒక టీ స్పూన్
చింత‌పండు ర‌సం – రుచికి స‌రిప‌డా
నీళ్లు – 2 గ్లాసులు
క‌రివేపాకు – ఒక రెబ్బ‌.
ఉప్పు – రుచికి స‌రిప‌డా

తాలింపు చేయడానికి కావలసిన పదార్థాలు:-

నూనె – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టీస్పూన్
ఆవాలు- ఒక టీస్పూన్
ఇంగువ- పావు టీస్పూన్
పచ్చి వెల్లుల్లి రెబ్బలు- 5
ఎండు మిరపకాయలు- 2
కరివేపాకు-ఒక రెమ్మ
త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Pesara Pappu Charu:శరీరానికి మేలు చేసే పెసర పప్పుచారు ఇలా చేసుకొండి

పెసర పప్పు చారు తయారు చేసే విధానము:-

 

కుక్కర్‌లో కడిగిన పెసరపప్పు టమోటాలు, ఉల్లిపాయలు తరిగిన పచ్చిమిర్చి, అలాగే పసుపు, ఒక టీస్పూన్ నూనె మరియు తగినంత నీరు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద కుక్కర్‌ పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కుక్కర్‌ మూత తీసి దానిలో కావలసినంత ఉప్పు, మిరియాలు వేసి మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి. ఇప్పుడు ఈమిశ్రమంలో చింతపండు రసం రెండు గ్లాసుల నీళ్ల‌ను పోసి బాగా కలుపుకోవాలి. దానిలో కరివేపాకు వేసి కుక్క‌ర్ ను స్ట‌వ్ మీద పెట్టి 10 నిమిషాల పాటు చారును చిన్న మంట‌పై ఉడికించాలి.

Read More  Uppu Shanagalu :ఇలా త‌యారుచేసి శ‌న‌గ‌ల‌ను తినడం వల్ల ఎంతో ఆరోగ్య‌క‌రం

ఇప్పుడు పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడి అయిన నూనెను పోయాలి. నూనె కాగాక కొత్తిమీర త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్ని వేసి తాళింపు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన తాళింపు ను రసంలో వేసి బాగా కలపాలి.ఇలా కలిపిన మిశ్రమాన్ని మరో రెండు నిమిషాలు ఉడికించాలి. చివరగా, కొత్తిమీర వేసి, ఆపై స్టవ్ను ఆపివేయాలి.ఎంతో రుచికరమైన పెసరపప్పు పులుసు ఇలా తయారవుతుంది. ఈ కూరను వేడి అన్నం మరియు నెయ్యితో కలిపి తింటే, ఇది రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి ప్రశాంతతనిస్తుంది.

Sharing Is Caring: