పతివ్రత అరుంధతి యొక్క పూర్తి వివరాలు

పతివ్రత అరుంధతి  యొక్క పూర్తి వివరాలు 

వశిష్ట మహర్షి గురించి వినే ఉంటారు. ఆయన పెళ్లి చేసుకోవాలని దేశము  అంతటా తిరుగుతూ ఉంటాడు.

ఒకసారి ఒక గ్రామంలో కన్నెలంతా వశిష్ట మహర్షి ని చూడడానికి వచ్చారు. వసిష్టుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు.వశిష్ట మహర్షి ఈ ఇసుకను ఎవరైనా సరే వండి అన్నంగా తయారు చెయ్యగలరా అని అడిగాడు.  ఆ గ్రామంలోని అమ్మాయిల్లో ఎవ్వరూ అన్నంగా వండడం   సాధ్యం కాదని చెప్పారు.

పక్క గ్రామమైన మాల పల్లె నుంచి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలబడి, నేను చేస్తానండి అని అన్నది .

వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టింది.

ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో ఇసుక వేసింది.  ఆమె ధ్యానం చేస్తూ వంట వడింది. ఇసుక అన్నంగా మారింది.

 

పతివ్రత అరుంధతి యొక్క పూర్తి వివరాలు

వశిష్టుడికి ఆ కుండలోని అన్నం చూపించింది.

ఆయనకు కూడా ఈ విషయం బోధపడలేదు ఆమెనే అరుంధతి. తర్వాత ఆ అన్నం తినమంటూ అరుంధతి వశిష్టుడికి వడ్డిస్తుంది. కానీ ఆయన తినడు.  నీవు నన్ను పెళ్లి చేసుకుంటేనే తింటాను అంటాడు. తర్వాత అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడుతాడు వశిష్టుడు. వాళ్లను ఒప్పించి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు.

Read More  బిల్వ వృక్షాన్ని ఇంట్లో పెంచితే కలిగే ఫలితాలు

అరుంధతికి ఎంతో ఏకాగ్రత ఉంటుంది. ఒకసారి వశిష్టుడు తన కమండలం ఆమెకు ఇచ్చి బయటకు వెళుతూ  తాను వచ్చే వరకు ఆమెను  కమండలం వైపే చూస్తూ ఉండమని చెబుతాడు. అరుంధతి తన భర్త వచ్చేవరకు దాన్నే చూస్తూ ఉండాలనుకుంటుంది.  అలా చాలా సంవత్సరాలు గడిచినా వశిష్టుడు రాడు.

అయితే అరుంధతి మాత్రం దాని వంకే చూస్తూ ఉంటుంది. ఆమె పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత. అయితే ఈ విషయాన్ని గురించి విన్న  కొందరు దేవతలు అమ్మా అరుంధతి మీ ఆయన ఇన్నేళ్లు అయినా తిరిగిరాలేదు. కాస్త ఇటు చూడమ్మా అంటారు.

పతివ్రత అరుంధతి యొక్క పూర్తి వివరాలు

అయినా ఆమె చూపు మరల్చదు.

కొన్ని ఏళ్ల తర్వాత వశిష్టుడు వచ్చి అరుంధతీ అని పిలిస్తే అప్పుడు ఆమె  ఆయన వైపు చూస్తుంది.

ఒకసారి అగ్ని దేవుడి ఎదుట సప్త ఋషులు యజ్ఞం చేపడుతారు.ఆ. ఋషుల భార్యలపై అగ్ని దేవుడు మోజు పడతాడు. ఈ విషయాన్ని అగ్ని దేవుడి భార్య అయిన స్వాహాదేవి గ్రహిస్తుంది. ఆ ఏడుగురి భార్యల మాదిరిగా తానే రోజు కొక అవతారం ధరించాలనుకుంటుంది. రోజు కొక ఋషి భార్య అవతారం ఎత్తి తన భర్త అగ్ని దేవుడి యొక్క  కోరిక తీరుస్తుంది.

Read More  వటపత్ర శాయి అనగా?

ఇక చివరి రోజు తాను అరుంధతిని అనుభవించబోతున్నాననే ఆనందంలో అగ్ని దేవుడి  ఉంటాడు అగ్నిదేవుడు. కానీ స్వాహాదేవి ఎంత ప్రయత్నించినా అరుంధతి అవతారంలోకి తాను  మారలేదు. అరుంధతి పెద్ద పతివ్రత కావడమే ఇందుకు ఒక  కారణం.

అందుకే ఆమె అరుంధతి నక్షత్రంగా మారి జగత్తుకు ఆందర్శంగా కూడా నిలిచింది. అరుంధతికి శక్తి అనే కుమారుడున్నాడు. శక్తి కుమారుడే పరాశరుడు. పరాశరుడి యొక్క కుమారుడే వ్యాసుడు.

అలా ఎంతో గొప్ప చరిత్ర కలిగింది అరుంధతి నక్షత్రం.

 

Sharing Is Caring:

Leave a Comment