గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసుకుందాము

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసుకుందాము

జీవితంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ఎన్ని కష్టాలను పడటానికి అయినా సిద్ధపడతారు. ఊరు సొంత ఊరు అని చెప్పుకోవాలంటే సొంత ఇల్లు అక్కడ  ఉండాలని భావిస్తారు. లేదంటే ఆ ఊరికి తాము పరాయివాళ్ళం అనే భావన  కూడా కలుగుతుంది. అందువల్ల  సొంత ఊరిలో ప్రతి ఒక్కరు సొంత ఇల్లు ఉండాలని అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.

ఇల్లు కట్టుకున్నాక బందువులను పిలిచి ‘గృహప్రవేశం’ చేస్తుంటారు. గోమాతను  కొత్త ఇంటిలోకి ముందుగా తీసుకువెళ్లి మొత్తం ఇల్లంతా తిప్పుతారు. ఆ తర్వాతే ఇంటి యజమాని మరియు  ఇతర కుటుంబ సభ్యులు ఇంటిలోకి వెళతారు.  అనాదిగా ఈ ఆచారం  వస్తుంది.

గోవును  సకలదేవతా స్వరూపంగా చెప్పబడింది. గోవుతో పాటే సమస్త దేవతలు వస్తారని శాస్త్రం కూడా చెబుతోంది. అందువలన నూతన గృహాల్లోకి గోవును తిప్పటం అనేది ఒక శుభసూచకంగా విశ్వసిస్తుంటారు. నూతన గృహంలో గోవు మూత్రం మరియు  పేడ వేసినట్లయితే మరింత శుభకరంగా భావిస్తుంటారు. అదే బహుళ అంతస్తుల్లో గృహప్రవేశం చేసినప్పుడు గోవును బహుళ అంతస్తుల్లో తిప్పటం కుదరదు. కాబట్టి ఆ ప్రాంగణంలో ఆవు దూడలను అలంకరించి పూజ చేయాలి. అలాగే గోవు పేడను మరియు  మూత్రాన్ని ఇల్లంతా చిలకరించాలి.

Read More  తీర్ధ ప్రసాధాల్లో నాలుగు రకాలు
Sharing Is Caring:

Leave a Comment