మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు

మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు

అక్షరలక్ష: ఈ గ్రంథం ఒక ఎన్సైక్లోపీడియా గ్రంథము.  దీని రచయిత వాల్మీకి మహర్షి. రేఖాగణితం, బీజగణితం మరియు  త్రికోణమితి, భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణితప్రక్రియలు ఉన్నాయి.  ఖనిజశాస్త్రం, భూగర్భశాస్త్రం, జలయంత్ర శాస్త్రం, గాలి మరియు  విద్యుత్, ఉష్ణం లను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో వివరించబడ్డాయి  .

శబ్దశాస్త్రం: శబ్దశాస్త్రం రచయిత ఖండిక ఋషి. సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను మరియు ప్రతిధ్వనులను ఇది చర్చించింది. ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం  మరియు వాటి పిచ్(స్థాయి), వేగాలను కొలవడం గురించి  వివరించారు.

శిల్పశాస్త్రం: దీని  రచయిత కశ్యపముని. ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి.307 రకాల శిల్పాల గురించి, 101 రకాల విగ్రహాలతో కలిపి దీనిని సంపూర్ణంగా చర్చించారు. గుళ్ళు, రాజభవనాలు, చావడులు మొదలైన నిర్మాణవిషయాలు 1000కి పైబడి  కూడా ఉన్నాయి. ఇదే శాస్త్రం పై విశ్వామిత్రుడు, మయుడు మరియు  మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులోఉన్నాయి.

మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు

Read More  తపస్సు..అంటే ఏమిటి

 

సూపశాస్త్రం: సూపశాస్త్రం రచయిత సుకేశుడు. ఇది ఒక  పాకశాస్త్రం. ఊరగాయలు, పిండివంటలు మరియు  తీపిపదార్థాలు, 108 రకాల వ్యంజనాలు మొదలగు అనేకరకాల వంటకాల గురించి, ప్రపంచవ్యాప్తంగా ఆ కాలం లో వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి ఇది చెప్పబడింది.

మాలినీ శాస్త్రం:దీని రచయిత ఋష్యశృంగ ముని. పూలమాలలను తయారుచేయడం, పూలగుత్తులు మరియు  పూలతో రకరకాల శిరోఅలంకరణలు,రహస్యభాషలో పూవులరేకుల పైన ప్రేమసందేశాలు పంపడం లాంటి అనేక విషయాలను  16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.

మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు

ధాతుశాస్త్రం: దీని రచయిత అశ్వినీకుమార. సహజ మరియు  కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు. మిశ్రలోహాలు మరియు  లోహాలను మార్చడం, రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.

విషశాస్త్రం: దీని రచయిత అశ్వినీకుమార.దీనిలో 32 రకాల విషాలు మరియు  వాటి గుణాలు, ప్రభావాలు, విరుగుడులు మొదలైన విషయాల  గురించి  చెప్పారు.

చిత్రకర్మశాస్త్రం(చిత్రలేఖనశాస్త్రం):  దీని రచయిత భీముడు.ఇందులో 12  రకాల అధ్యాయాలు ఉన్నాయి. సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చెప్పారు. ఒక వ్యక్తి తలవెంట్రుకలను గాని, గోటిని కాని మరియు  ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ  గురించి చెప్పబడింది.

Read More  తెలుగులో శ్రీ హనుమాన్ చాలీసా

మల్లశాస్త్రం:  దీని రచయిత మల్లుడు. వ్యాయామాలు మరియు  ఆటలు, వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు గురించి  చెప్పబడ్డాయి.

రత్నపరీక్ష: దీని రచయిత వాత్సాయన ఋషి. రత్నాలకు ఉన్న 24 లక్షణాల గురించి  చెప్పబడ్డాయి. వీటిశుద్దతను పరీక్షించడానికి 32  రకాల పద్దతులు చెప్పబడ్డాయి. రూపం మరియు  బరువు మొదలగు తరగతులుగా విభజించి తర్కించారు.

మహేంద్రజాల శాస్త్రం: సుబ్రహ్మణ్యస్వామి స్వామి శిష్యుడైన వీరబాహువు దీని  రచయిత. నీటిపై నడవడం మరియు  గాలిలో తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.

మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు

 

అర్థశాస్త్రం:దీని రచయిత వ్యాసుడు. ఇందులో భాగాలు మూడు . ధర్మబద్ధమైన 82 ధనసంపాదనా విధానాలు దీని లో వివరించారు.

శక్తితంత్రం:  దీని రచయిత అగస్త్యముని. ప్రకృతి, సూర్యుడు మరియు  చంద్రుడు, గాలి, అగ్ని మొదలైన 64 రకాల బాహ్యశక్తులు, వాటి ప్రత్యేక వినియోగాలు గురించి  చెప్పబడ్డాయి.అణువిచ్చేదనం కూడా  ఇందులోని భాగమే.

Read More  పురాణ స్త్రీలు - వారి వివరాలు

సౌధామినీకళ: దీని రచయిత మతంగ ఋషి. నీడల ద్వారా మరియు ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం గురించి  చెప్పభదింది. భూమి మరియు పర్వతాల లోపలి భాగాల ఛాయాచిత్రాలను తీసే ప్రక్రియ ద్వారా చెప్పబడింది.

మేఘశాస్త్రం: దీని రచయిత అత్రిముని. దీనిలో 12 రకాల మేఘాలు మరియు 12 రకాల వర్షాలు, 64 రకాల మెరుపులు,33 రకాల పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.

స్థాపత్యవిద్య:ఇది  అదర్వణవేదం లోనిది. ఇంజనీరింగ్, ఆర్కితెక్చర్ మరియు  కట్టడాలు, నగరప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.

ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం, సాముద్రిక శాస్త్రం మరియు  అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం, కుమారస్వామి రచించిన గజశాస్త్రం, భరద్వాజ ఋషి రచించిన యంత్రశాస్త్రం మొదలగునవి.  ఆయుర్వేదం, ధనుర్వేదం మరియు  గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు కూడా ఉన్నాయి.

నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు.  మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద గురించి  తెలియదు . వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు.

Sharing Is Caring:

Leave a Comment