...

అయ్యప్పస్వామి యాత్రలో శీరంగుత్తి వివరాలు

_*?అయ్యప్ప చరితం – 67 వ అధ్యాయం?*_
?️☘️?️☘️?️☘️?️☘️?️☘️?️
*శీరంగుత్తి:* 
 ఇక్కడే అయ్యప్ప స్వామి సైనికుల ఆయుధాలు రావిచెట్టు క్రింద పెట్టించినందువల్ల యాత్రకు దీక్ష స్వీకరించి వచ్చిన స్వాములు తాము తెచ్చిన శరము , కత్తి , గద మొదలైన ఆయుధాలను ఈ ప్రదేశంలో వుంచుతారు ! గంట తెచ్చిన వాళ్లు గంటను గుడిలో కడతారు !
శీరం గుత్తినుండి కొద్ది దూరంలో శబరిగిరీశుని ఆలయం దర్శనమిస్తుంది ! అదే స్వామి సన్నిధానం ! అక్కడికి చేరడంతో శ్రమ అంతా మాయమై అలౌకికానందంతో మనస్సు , శరీరం పరవశించిపోతాయి !
అయ్యప్పస్వామి యాత్రలో శీరంగుత్తి వివరాలు

 

స్వామి సన్నిధానం
గర్భగుడిలోని స్వామిని ఎప్పుడెప్పుడు కన్నుల కరువుదీరా దర్శిద్దామా అన్న ఆత్రుత అందరూ దీక్షాధారులలో , భక్తులలో అధికమౌతుంటుంది ! ఒక వరుసలో శరణుఘోష చెప్పుకుంటూ తూర్పు నుండి స్వామి సన్నిధికి తీసుకువెళ్ళే పద్ధెనిమిది పవిత్రమైన మెట్లును దీక్షాధారులు ఎక్కటం ప్రారంభిస్తారు.
*పదునెట్టాంబడి – పద్ధెనిమిది మెట్లు:* 
ఇవి పరశురాముని చేత ప్రథమంగా నిర్మింపబడినవి ! పద్ధెనిమిది మంది దేవతలు తమ శక్తులను వీటిలో విలీనం కావించటం , ఈ మెట్ల మీదగా నడిచి అయ్యప్పస్వామి తన పీఠాన్ని చేరి ఆసీనుడు కావటం జరిగాయి ! స్వామి పాద స్పర్శ నోచుకున్న ఈ మహిమాన్వితమైన మెట్లపై కాలు పెట్టడానికి దీక్షాధారులు మాత్రమే అర్హులు ! ఇతరులు ఈ మెట్లపై నుండి కాకుండా మరో ప్రక్కగా వున్న మార్గాన వెళ్లి స్వామిని దర్శించుకుంటారు.
*పడిపూజ:* 
ఈ మెట్లకు రోజు వాటి పవిత్రత చెదరకుండా వుండటానికి ప్రధాన తంత్రి పూజారులు షోడశోపచారాలతో పూజలు నిర్వర్తిస్తూ వుంటారు ! ఇందువల్ల పొరబాటున దీక్ష స్వీకరించని వాళ్లు ఎవరైనా పాదాలు మోపడం జరిగితే అందువల్ల జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం జరిగి వాటి పవిత్రత తరిగిపోకుండా ఉంటుంది !
*మెట్లు ఎక్కటం:* 
మెట్ల మొదట్లో ఒక ప్రక్క స్వామి మిత్రుడైన కరప్ప స్వామి , మరోప్రక్క  కుడుత్తన్ స్వామి  విగ్రహాలు ఉంటాయి ! వాటికి కొబ్బరికాయలు కొట్టి నమస్కరించి దీక్షాధారులు ఇరుముడి తలమీద జాగ్రత్తగా పెట్టుకుని ఒక్కొక్క మెట్టుగా ఎక్కడం ప్రారంభిస్తారు .
మెట్లు ఎక్కేటప్పుడు ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్కటి చొప్పున కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్య , ఈర్ష్య , దంబం లనే అష్టరాగాలను మొదటి ఎనిమిది మెట్లు ఎక్కుతూ వాటిని విడిచిపెడుతున్నట్లు స్వామికి మానసికంగా చెప్పుకోవాలి ! మెట్లు యొక్క దేవతకు నమస్కరించుకోవాలి ! తరువాతి ఐదు మెట్లు ఎక్కేటప్పుడు వరసగా నాలుకతో పలికిన తప్పులను కళ్లతో చూసిన చెడును , చెవులతో విన్న పాపపు మాటలను , చేతులతో కాళ్ళతో చేసిన పాపాలను (పంచేంద్రియాలవల్ల జరిగిన అపరాధాలను) మన్నించమని ప్రార్థిస్తూ దేవతలకు నమస్కరిస్తూ ఎక్కాలి ! తరువాత మూడు మెట్లమీద వరసగా సత్వగుణాన్ని వృద్ధి చేయమనీ , రజో , తమో గుణాలను అణివేయమనీ ప్రార్థిస్తూ పైకెక్కాలి ! చివరగా వున్న రెండు మెట్లలో పదిహేడవ మెట్టుమీద అవిద్యవల్ల వచ్చే అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. పద్ధెనిమిదవ మెట్టు మీద నిలబడి జ్ఞానాన్ని ప్రసాదించే సద్విద్య ప్రసాదించమని నమస్కరిస్తూ స్వామి సన్నిధానాన్ని చేరుకోవాలి ! ఈ విధంగా అష్టరాగాలను , పంచతత్వాల చేత జరిగే పాపాలను , త్రిగుణాలను విద్య , అవిద్యలనే వాటిని మొత్తం పద్దెనిమిదింటిని పద్ధెనిమిది మెట్లమీద అదుపు చేసి పరిశుద్ధాత్మలతో మెట్ల మార్గాన సన్నిధానాన్ని చేరుకుంటారు దీక్షాధారులైన భక్తులు. (ప్రారంభంలో దీక్షాధారులు మెట్లు కొక్కటి చొప్పున కొబ్బరికాయలు కొడుతుండేవారు ! ఆ విధంగా చేయడంవల్ల రాతి మెట్లు శిథిలమవుతుండటం గమనించి కొబ్బరికాయలు కొట్టకూడదని నియమం ఏర్పర్చటం , మెట్లకు రక్షణగా పంచలోహపు తొడుగులను (తాంత్రిక పూజాదులతో శక్తివంతం చేసినవి) ప్రధాన తంత్రుల సహాయంతో రాతిమెట్లకు అమర్చడం జరిగింది. 1985 ప్రాంతంలో) ఇప్పుడు లోహపు తొడుగుతో బంగారంలా మెరుస్తున్న పద్ధెనిమిది మెట్లను ఎక్కి స్వామి సన్నిధిని చేరుకుంటారు దీక్షాధారులు !
*మూల విగ్రహం:*
 మెట్లు ఎక్కగానే ముందుగా ద్వజస్తంభం కనిపిస్తుంది! ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేస్తుంటే గణపతి , నాగరాజుల చిన్న గుడులు కనిపిస్తాయి ! వాటికి నమస్కరించి అయ్యప్పస్వామి మూల విగ్రహం ను దర్శించుకుంటారు .
మణికంఠుని మూల విగ్రహం సుమారు 18 అంగుళాల ఎత్తులో , పంచలోహ మూర్తిగా , చిన్ముద్రా , అభయముద్రలతో పట్టబంధముతో పీఠంపై ఆసీనమై దర్శనమిస్తుంది ! అత్యంత మనోహరము , శక్తివంతమూ అయిన మూల విగ్రహాన్ని చూస్తూ భక్త్యావేశంతో పరవశించిపోతారు దీక్షాధారులు . మరొకదారినుండి వచ్చి దర్శించుకున్న ఇతర భక్తజనులు !     ఈ విగ్రహానికే అన్ని రకాల అభిషేకాలు , పూజలు జరుగుతుంటాయి.
???????????
Sharing Is Caring:

Leave a Comment