పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయం జనగామ జిల్లా

పాలకుర్తి  సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయం జనగామ జిల్లా

శివకేశవులు ఇద్దరూ స్వయంభువులుగా ఒకే కొండపై వెలసిన దివ్యక్షేత్రం పాలకుర్తి, కొండ పై ఉన్న గుహల్లో సోమేశ్వరుడు, లక్ష్మీనరసింహుడు కొలువుదీరారు. శివారాధకులకు, వీరశైవులకు దర్శనీయ క్షేత్రం ఇది. ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా ఐదు రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు స్వాములను దర్శించుకుని కొబ్బరి కాయలు కొట్టి, గండ దీపాలు వెలిగిస్తారు. కోడెలను కట్టేసి మొక్కులు చెల్లిస్తారు.పెళ్లి కాని వారు మొక్కుకొని పెళ్లయిన తర్వాత స్వామి వారి కళ్యాణం చేయిస్తారు. స్వామివారికి పల్లకీ సేవ ప్రత్యేకం. సంతానం లేని వారు మొదట కొబ్బరి కాయలు కడతారు. 
 జనగామ జిల్లాలోని పాలకుర్తిలో సోమేశ్వర, లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో శివకేశవులు ఇద్దరూ పక్కపక్కనే ఉన్న రెండు గుహల్లో కొలువై ఉన్నారు. ఈ రెండు గుహలను కలుపుతూ ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ప్రదక్షిణా మార్గం ఉంది. శివకేశవులను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయం దగ్గర ఉండే రెండు రాళ్లకు, చెట్ల కొమ్మలకు తేనెపట్లు ఉంటాయి. ఎవరైనా శుభ్రత పాటించకుండా ఆలయానికి వస్తే తేనెటీగలు వాళ్ల వెంట పడి కుడతాయని భక్తులు చెప్తుంటారు. కోర్కెలు తీరినా మొక్కు చెల్లించకపోతే దేవుడే కలలో కనిపించి గుర్తు చేస్తాడని అంటుంటారు.
ఇక్కడున్న కొండ ఒకప్పుడు కలిసే ఉండేది. అయితే ఒక భక్తురాలు.. ప్రదక్షిణ చేయడానికి కొండ అడ్డుగా ఉంది. దీన్ని చీల్చి దారి ఏర్పాటు చేయాలని స్వామిని కోరింది. దాంతో ఆ కొండ రెండుగా చీలి ప్రదక్షిణ మార్గం ఏర్పడింది అని భక్తులు చెప్తుంటారు. కొండ మీద ఉన్న శిఖర దర్శనం చేసుకోవడానికి పెద్దపెద్ద రాళ్ల మధ్య నుంచి పైకి మెట్ల మార్గం ఉంది. ఈ మార్గం ద్వారా భక్తులు పైకి ఎక్కి గండదీపం వెలిగించి మొక్కులను తీర్చుకుంటారు.
ఆలయ విశేషం మెట్ల మార్గం స్వామి వార్ల రెండు గుహలకు దక్షిణంగా ఉంటుంది. ఈ మార్గానికి ఆనుకొని కొండ లోపలికి ఒక సొరంగ మార్గం ఉంది. దీన్ని ‘నేల బయ్యారం’ అని పిలుస్తారు. ప్రస్తుతం సొరంగాన్ని మూసివేశారు. ఇది మహర్షులు తపస్సు, యజ్ఞయాగాదులు చేసిన రహస్య స్థలం అని చెప్తుంటారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే..

పాలకుర్తి  సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయం జనగామ జిల్లా

రాత్రి వేళల్లో ఇప్పటికీ ఈ కొండ నుంచి ఓంకారం వినిపిస్తుంటుంది. అయితే… ఈ సొరంగంలో ఏముందో తెలుసుకునేందుకు గతంలో కొందరు అర్చకులు, గ్రామ పెద్దలు కలిసి ప్రయత్నించారు. సొరంగంలోకి కొంతదూరం వెళ్లిన తర్వాత గాలి సరిగా ఆడక వెనక్కి వచ్చేశారు. గుహకు పక్కనే వీరాంజనేయస్వామి విగ్రహం ఉంది. అక్కడికి వెళ్లాలన్నా పెద్ద రాళ్ల మధ్య ఉండే మెట్లు ఎక్కాలి. వేల సంవత్సరాల క్రితం ఈ కొండ గుహల నుంచి పాలలా ఉండే తెల్లటి నీరు ప్రవహించేదట. అందువల్లే దీన్ని ‘క్షీరగిరి’ అని కూడా పిలుస్తారు.

-:దేవుళ్ళ దర్శనం :-
గుహలో దక్షిణంగా సోమేశ్వర స్వామి ఉన్నారు. ఆ స్వామికి ఎడమవైపు ఉన్న మార్గం నుంచి వెళ్తే అక్కడ నరసింహస్వామి కొలువుదీరాడు. సోమేశ్వరుడి ఉత్సవ మూర్తి అడుగున్నర ఎత్తులో, లక్ష్మీనరసింహుడి విగ్రహం మూడు అడుగుల ఎత్తు ఉంది. స్వాములను దర్శించుకున్న ప్రతి భక్తుడిని అర్చకులు స్వామి పాదాల దగ్గరున్న చిన్న బెత్తంతో వీపుపై తాకించడం ఆనవాయితీ. ఇలా చేస్తే మానసిక, శారీరక సమస్యలు తొలగిపోతాయని చెప్తుంటారు.

 

Read More  ఊటీ లో మూడు రోజులలో చూడవలసిన ప్రదేశాలు,Places to See in Ooty in Three Days
-:లక్షలాదిగా భక్తులు:- 
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల వాళ్లు కూడా లక్షలాదిగా వస్తారు. కొండ చుట్టూ ఎడ్ల బండ్లకు ప్రభలు కట్టి ఆలయం చుట్టూ తిరుగుతారు. యజ్ఞ, యాగాదులతో పాటు దివ్య రథోత్సవం వైభవంగా జరుగుతుంది.
పిల్లలు లేని వాళ్లు కొబ్బరికాయముడుపు కడతారు. సంతానం కలిగాక తొట్టెలు కట్టి డోలారోహణం చేస్తారు. ఇల్లు కడితే బంగారు, వెండి, కర్రలతో బొమ్మలు చేసి మొక్కులు చెల్లిస్తారు. ఐదు రోజులు జరిగే ఉత్సవాల్లో చివరి రోజున అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహిస్తారు. కొండపైకి ఈజీగా వెళ్లేందుకు ఘాట్ రోడ్డు ఉంది. హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, స్టేషన్ ఘన్‌పూర్, జనగామ, తొర్రూరుల నుంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి.
-: ఎలా వెళ్లాలి:-
కొండపైకి చక్కని ఘాటురోడ్డు సౌకర్యం కూడా కలదు. యాత్రీకులకు కావలసిన కనీస వసతులు అన్నీఇక్కడ ఉన్నాయి. ఇక్కడికి చేరుకోవడానికి హైద్రాబాద్, హన్మకొండ, వరంగల్, ష్టేషన్ ఘనపూర్, జనగామ మరియు తొర్రూరుల నుండి రవాణా సౌకర్యాలున్నాయి. వరంగల్ కు 60 కిలోమీటర్ల దూరంలో పాలకుర్తి ఉంది. వరంగల్- హైదరాబాద్ హైవేలో ఉన్న స్టేషన్ ఘన్పూర్ నుంచి 23 కి.మీ. ప్రయాణించాలి. పాలకుర్తికి వెళ్లగానే రైట్ సైడ్ ఆర్చి ఉంటుంది. దాన్ని దాటుకొని కొంచెం ముందుకు వెళ్తే సోమేశ్వర, లక్ష్మీనర్సింహాలయం కనిపిస్తుంది.

పాలకుర్తి  సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయం జనగామ జిల్లా

సోమనాథుడు ఇక్కడివాడే.. 
ప్రసిద్ధ వీరశైవ కావ్యం ‘బసవ పురాణం’ రాసిన పాల్కురికి సోమనాథుడు ఈ గ్రామానికి చెందినవాడే. ఆయన 12వ శతాబ్దానికి చెందినవాడు. విష్ణురామిదేవుడు, శ్రియాదేవమ్మ దంపతులకు సోమేశ్వరస్వామి వరప్రసాదంగా ఆయన పుట్టాడట. అందుకే ఆయనకు ‘సోమనాథుడు’ అని పేరు పెట్టారంటారు. సోమనాథుడు.. సోమేశ్వర స్వామిని స్తుతిస్తూ సోమనాథుని స్వరాలు’ రాశాడు. ‘అనుభవ సారము, పండితారాధ్య చరిత్ర, చతుర్వేద సారము’.. ఇలా అనేక గ్రంథాలు, ఎన్నో లఘుకృతులను సోమనాథుడు రచించాడు.

గ్రామంలో సోమనాథుని స్మృతి చిహ్నంగా కట్టిన శివాలయం ఉంది. ‘శ్రీ ఆంధ్రమహా భాగవతమందార మకరందా’న్ని తెలుగు వాళ్లకు అందించిన భక్తకవి పోతన పుట్టిన ‘బమ్మెర’ కూడా ఇక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సహజ పండితుడైన పోతనామాత్యుడు సోమేశ్వరుడు, లక్ష్మీనరసింహుడిని తరచూ దర్శించుకునేవాడని.. అప్పటి గ్రంథాల్లో ఉంది. వాల్మీకి మహర్షి కూడా పాలకుర్తికి ఐదు మైళ్ళ దూరంలో వల్మిడి (వాల్మీకి పురం)లోని కొండల్లో కొన్నాళ్లు ఉన్నట్లు ఆనవాళ్లు కూడా ఉన్నాయి.గండదీపం :- ఇక్కడే గండదీపం మిద్దె ఉంటుంది. ఈ మార్గం ద్వారా భక్తులు పైకి వచ్చి గండదీపం వెలిగించి తమ మొక్కులను తీర్చుకుంటారు. కొంచెం బరువైన శరీరం కలిగిన వారు, చీకటికి భయపడేవారు, ఆథునికంగా నిర్మించిన వేరే మెట్ల దారి ద్వారా పైకి చేరుకొని గండదీపం వెలిగించుకుంటారు.

Read More  కుట్రాలం జలపాతం పూర్తి వివరాలు,Full details Of Kutralam Falls

ఉత్సవాలు : మహాశివరాత్రికి శ్రీ సోమేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి, జాతరకు రాష్ట్రం నలుమూలలనుండే కాక కర్నాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలనుండి కూడ లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఉత్సవాలలో భాగంగా యజ్ఞ యాగాదులతో పాటు, దివ్యరథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కొండచుట్టు ప్రభలు కట్టిన ఎడ్లబండ్లు పరుగులు తీస్తాయి. చివరి రోజున అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతుంది. శ్రావణ మాసంలో శత:చండీ హవనం, రుద్రహవనం, లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చనలు జరుగుతాయి. కార్తీక దీపోత్సవం, మార్గశిర మాసంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మార్గళి ప్రాత:కాలార్చనలు, నైవేద్యాలు, ప్రసాదవినియోగం ఉంటాయి. శ్రీ సోమనాథ మహాకవి శివైక్యం పొందిన ఫాల్గుణ మాసంలో ప్రత్యేక ఉత్సవాలుంటాయి. ప్రతి మాస శివరాత్రికి శ్రీ స్వామివారి కళ్యాణం నిర్వహించ బడుతుంది.

పాలకుర్తి సోమేశ్వరాలయం

పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం, జనగాం జిల్లా, పాలకుర్తి మండలంలో ఉంది.

ఈ గ్రామానికి జనగాం సమీప పట్టణం. హైదరాబాద్ నుండి పాలకుర్తి చేరుకోవడానికి జనగాం మీదుగా సూర్యాపేట రహదారి వైపు 110 కిలోమీటర్లు ఉంటుంది.

Read More  ఖజురహో దేవి జగదాంబ దేవాలయం చరిత్ర పూర్తి వివరాలు,Full Details Of Khajuraho Devi Jagdamba Temple

గుహలోపల కొండపై శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది.

బొమ్మర పోతన్న జన్మస్థలం పాలకుర్తికి అతి సమీపంలో ఉంది.

వీరశైవాన్ని అభివృద్ధి చేసిన శ్రీ పాల్కురికి సోమనాథుడు ఇక్కడే పుట్టి పెరిగాడు. తెలుగులో గధ్య రచన చేసిన మొదటి రచయిత. అతను 12వ శతాబ్దంలో జీవించాడు. ఈ గ్రామంలో మరియు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో శ్రీ సోమేశ్వర లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయం, బొమ్మర పోతన స్థానిక స్థలం మరియు ఆలయం, వల్మిడి శ్రీరామ ఆలయం మరియు విస్నూర్ దేశ్‌ముఖ్ కోట ఉన్నాయి.

అన్ని మతాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు, వారిలో ఎక్కువ మంది హిందువులు. ఇది తెలంగాణలో ఒక భాగం. పాలకుర్తికి వచ్చే ప్రజల కోసం దేవాదాయ శాఖ నుండి వసతి గృహం అందుబాటులో ఉంది. అలాగే శ్రీ రాపాక సుధాకర్ మరియు ఆర్య వైశ్య సంఘంలోని ఇతర సభ్యులు అభివృద్ధి చేసిన ఆర్య వైశ్యులకు చక్కని వసతి మరియు ఉచిత ఆహారం ఉంది. వరంగల్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో పాలకుర్తి మండల హెడ్ క్వార్టర్స్ వెలుపలి స్కర్ట్స్‌లోని కొండపై ఉంది. 12వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవి పాలకుర్తి సోమనాధ కవి జన్మస్థలం కూడా ఇదే.
ఆయన సమాధిని ఇక్కడ చూడవచ్చు.

ఈ చారిత్రాత్మక ఆలయం కొండపై 120 మీటర్ల ఎత్తులో ప్రక్కనే ఉన్న రెండు గుహలలో అవతరించిన శివుడు మరియు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి అంకితం చేయబడింది.

రెండు గుహల చుట్టూ ఉన్న ‘ప్రదక్షిణ మార్గం’ చాలా సహజమైనది. శిథిలమైన ‘సూర్య’ ఆలయం ఉంది మరియు కోనేరు కూడా ఈ ప్రదేశంలో చూడవచ్చు. ఒకప్పుడు వర్ధిల్లిన ఈ ప్రదేశం ‘వీర శైవ’ హిదూయిజం యొక్క అనుచరులు కాలక్రమేణా ప్రాముఖ్యతను కోల్పోయారు, ప్రస్తుతం ఇది వరంగల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉంది. యాత్రికులు ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వస్తున్నారు. ప్రధానంగా వీరశైవులు ప్రతిష్ఠాపన దేవతలు మరియు సోమనాధకుని ఆశీస్సులు పొందేందుకు సంవత్సరానికి ఒకసారి తప్పకుండా సందర్శిస్తారు.

Sharing Is Caring:

Leave a Comment