మునగాకు– మానవుల పాలిట సంజీవని
మానవుల పాలిట సంజీవనిగా మునగాకు ను భావిస్తారు. ఎందుకంటే 300 లకు పైగా వ్యాధులను నయం చేసే శక్తి దీనిలో ఉంది అని చాల పరిశోధనలలో తేలింది. మునగాకును వంటలలో వాడుతారని చాల మంది కి తెలియదు. మునక్కాయలను వాడినంతగా మునగాకును వాడరు. వేల సంవత్సరాల నుండి వైద్యంలో మునగాకు చాల ప్రాముఖ్యత ఉంది.
పోషకాలు:
మనకు లభించే అన్ని ఆకు కూరల కంటే మునగాకులలో ఎక్కువ పోషకాలు మరియు ఖనిజ లవణాలు ఉన్నాయి . ఆందుకే దీనిని సంజీవనిగా పిలుస్తారు . మునగాకులో ముఖ్యంగా విటమిన్ ‘ఏ’ పుష్కలంగా ఉంటుంది . ఇంకా విటమిన్ సి, కాలిషియం, ఐరన్ మరియు ఫైబర్ ఎక్కువగా లభిస్తాయి . పాలలో కంటే 17 రేట్లు ఎక్కువగా కాల్షియమ్, పెరుగులో ఉండే ప్రోటీన్ల కంటే 8 రేట్లు అధికంగా, అరటి పండ్ల కంటే 15 రేట్లు పొటాషియం ఎండిన మునగాకు పొడిలో కూడా లభిస్తుంది.
లాభాలు:
ఐదు రకాల క్యాన్సర్ నివారణలో మునగాకు ఉపయోగపడుతుంది.
యాంటీ ట్యూమర్స్ గా మునగాకు కూడా బాగా పనిచేస్తుంది.
థైరాయిడ్ ను రెగ్యులేట్ చేస్తుంది. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది.
మునగాకు కషాయం తీసుకోవటం వలన దృష్టి మాంద్యం మరియు రేచీకటి తొలగిపోతాయి.
ప్రారంభ దశలో ఉండే కీళ్ల నొప్పులకు మునగాకు లేపనంతో కట్టు కట్టుకోవటం వలన తగ్గిపోతాయి . చర్మ వ్యాదులకు కూడా మునగాకును లేపనంగా వాడుతారు.
మునగాకు రసాన్ని, దోసకాయ రసంతో కలిపి తాగటం వలన గుండె, కాలేయం మరియు మూత్ర పిండాల సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి.
ఒక స్పూన్ కొబ్బరి నీళ్లలో మునగాకు రసం కలిపి తాగటం వలన విరోచనాలు తగ్గుతాయి.
గర్భిణీలకు, బాలింతలకు మునగాకు రసం అమృతం లాంటిది. బాలింతలకు మునగాకు కూరలు చేసి తినిపించటం వలన పాల బాగా అభివృద్ధి ఉంటుంది.
మునగాకు రసాన్ని తీసుకోవటం వలన రక్తహీనత సమస్యలు చాలా తగ్గిపోతాయి.
మునగాకు రసాన్ని పాలలో కలిపి పిల్లలకు తాగించటం వలన ఎముకలు చాలా దృడంగా తయారవుతాయి.
మునగాకు కషాయం తయారు చేసి అందులో ఉప్పు, మిరియాలపొడి మరియు నిమ్మరసం కలిపి తాగితే దగ్గు, ఆస్తమా, టి.బి వంటి వ్యాదులు తగ్గుతాయి.
Post a Comment