మారేడుదళాల నోము పూర్తి కథ

మారేడుదళాల నోము పూర్తి కథ

           పూర్వం ఒకానొక దేశపు రాజకుమారుడు ఆయువుడు తీరి చనిపోయాడు.  రాజు శవం  తోడులేకుండా పోరాదుకనుక నా కుమారుని శవానికి తోడుగా పోవుటకు ఎవరైనా తీసుకు రావలసిందని మృతుని తండ్రియైన మహారాజు భటులను  బయటకు పంపాడు.  ఆ భటులు ఎంతగా తిరిగినా చచ్చిన వానికి తోడుగా పోవుటకు గాని తమ వారి నేవరైనా తోడుగా పంపించుటకు గాని ఏ ఒక్కరూ  కూడా ముందు  అంగీకరించలేదు.

మారేడుదళాల నోము పూర్తి కథ

 

           ధనాశ పరులైన ఒక బ్రాహ్మణ వనితా తన సవతి బిడ్డను ఎత్తుకు ఎట్టు ధనం పుచ్చుకుని పంపించుటకు అంగీకరించినది.  ఆమె అడిగిన  ప్రకారం ధనమిచ్చి రాజు భటులు ఆ పిల్లను  వారి  వెంట తీసుకుని వెళ్ళారు.  అలా తీసుకుని వచ్చిన ఆ పిల్లను రాకుమారుని శవంతోపాటు కట్టి  స్మాశానానికి తీసుకుని వెళ్ళుతున్నారు.  ఆకస్మికంగా చీకట్లు కమ్ముకుని పెద్ద వర్షం కురిసింది.  ఆ వర్షంలో  ముందుకు పోలేక శవాన్ని శివాలయం ముందు  దింపి వారంతా తప్పుకుని వెళ్ళారు.  ఆ బాలిక కట్లు వూడదీసుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి ఆలయం లోపలకు వెళ్లి పార్వతీ పరమేశ్వరులు ముందు కూర్చుని తన దుస్థితికి పరితపిస్తూ భోరుభోరున ఏడ్వసాగింది.  కరునామయులైన ఆ దంపతులు ఆమెను ఆగ్రహించి అక్షతలు జలాన్ని ఇచ్చి రాకుమారుని శవంపై చల్లమన్నారు.  మారేడు దళం నోము   ముందుగా నోచుకోవలసినదని చెప్పారు .  ఆ ఆది దంపతులు ఆదేశానుసారం ఆ చిన్నది మారేడు దలముల నోమును నోచి శవం పై మంత్ర జలాన్ని సంప్రోక్షించి అక్షింతలు కూడా  వేసింది.  రాకుమారుడు నిద్రమేల్కొన్న్ట్టు సజీవుడై లేచి కూర్చున్నాడు.  జరిగిన విషయాన్ని అంతా  ఆమె వల్ల విన్నాడు.

Read More  తులసినోము పూర్తి కథ

          ఇంతలో తెల్ల వారుతుండగా రాజు తాలూకు జనులు శవాదాహన సంస్కారం చేయడానికి వచ్చారు.  బ్రతికి వున్న రాకుమారుడిని చూసి వారు  ఆశ్చర్య పడ్డారు.  వారిని అంతఃపురానికి తీసుకువెళ్ళారు.  రాజ దంపతులు ఎంతగానో ఆనందించి ఆ బాలికతో తమ కుమారునికి ఇచ్చి  వివాహం చేసారు.

ఉద్యాపన: –

మారేడు దలములను వెండితోను బంగారముతోను చేయించి మారేడు దలములను మూడింటిని కలిపి మూడు దోసిళ్ళ బియ్యంతో శివునకు పూజచేసి నిరుపేదలకు అన్న దానం చేయ వలెను.

Sharing Is Caring:

Leave a Comment