పంచగయలు యొక్క పూర్తి వివరాలు
మన దేశంలో మొత్తం ఐదు గయలు ఉన్నాయి .
అవి :-
1. శిరోగయ, 2. నాభిగయ, 3. పాదగయ, 4. మాతృగయ, 5. పితృగయ.
శిరోగయ:-
శిరోగయ బిహార్ రాష్ట్రంలో ఫల్గుణీ నదీ తీరంలో వెలసింది. దీనినే బుద్ధగయ అని కూడా అంటారు.
నాభిగయ :-
జాజాపూర్, మరియు ఒరిస్సా రాష్ట్రంలో వైతరణి నదీ తీరంలో వున్న ప్రదేశంను “నాభిగయ” అని కూడా అంటారు.
పంచ గయలు యొక్క పూర్తి వివరాలు
పాదగయ:-
పిఠాపురం మరియు ఆంధ్ర ప్రదేశ్లో గయని పాదాలుండటం వలన అవి వున్న ప్రదేశం పిఠాపురాన్ని “పాదగయ” అని అంటారు.
మాతృగయ : –
గుజరాత్ రాష్ట్రంలో మహేషన జిల్లాలో సరస్వతీ నదీ తీరంలో గల ప్రాంతాన్ని “మాతృగయ”అని కూడా అంటారు. బిందు సరోవరమనే మరో పేరు కూడా కలదు. అహమ్మదాబాదుకు 32 కి||మి|| దూరంలో గల మాతృగయలో మాతృవంశం వారికి పిండప్రదానం చాలా ముఖ్యం. ఒరిస్సాలోని భువనేశ్వర్కి 33 కి .మి.దూరంలో వున్న బిందు సరోవరం వద్ద కూడా పిండ ప్రదానాలు చేస్తారు.
పితృగయ : –
బధరీనాథ్, ఉత్తర ప్రదేశ్లోని అలకనందా నదీ తీరంలో గల “బ్రహ్మకపాలం” అనే ప్రదేశాన్ని “పితృగయ” అని కూడా అంటారు.